ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత కోహ్లీ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-07-17T08:22:36+05:30 IST

ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత కోహ్లీ కీలక నిర్ణయం

ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత కోహ్లీ కీలక నిర్ణయం

లండన్: టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు విరామం ఇవ్వనున్నాడని, ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్ ముగిసిన తర్వాత కూడా లండన్‌లోనే ఉంటాడని తెలుస్తోంది. కోహ్లీ క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటాడని ,విరామ సమయంలో అతని తల్లితోపాటు కుటుంబంతో కలిసి ఉంటాడని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టులో కోహ్లీకి చోటు దక్కలేదు.


వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ నెల 29న ఆరంభమయ్యే ఈ సిరీస్ కు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, పేసర్‌ బుమ్రా, స్పిన్నర్‌ చాహల్‌లకు విశ్రాంతినిచ్చారు. వెటరన్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌కు జట్టులో చోటు కల్పించారు. గతేడాది నవంబరులో అతను చివరి టీ20 ఆడడం గమనార్హం. రోహిత్‌ శర్మ ఆధ్వర్యంలో 18 మందితో కూడిన జట్టును జాతీయ సెలెక్టర్లు గురువారం ఎంపిక చేశారు. అలాగే ఐదు మ్యాచ్‌ల్లో చివరి రెండింటిని అమెరికాలో నిర్వహించనున్నారు.

Updated Date - 2022-07-17T08:22:36+05:30 IST