రిషబ్ సెంచరీ.. కోహ్లీకి పట్టలేని ఆనందం... వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-03-06T03:54:37+05:30 IST

నాలుగో టెస్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్(101) సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. చాలా మ్యాచ్‌ల నుంచి రిషబ్ 90లలో అవుటైపోతున్నాడు. అయితే ఈ సారి మాత్రం సెంచరీ మార్క్ దాటాడు. దీంతో రిషబ్‌తో పాటు..

రిషబ్ సెంచరీ.. కోహ్లీకి పట్టలేని ఆనందం... వీడియో వైరల్

అహ్మదాబాద్: నాలుగో టెస్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్(101) సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. చాలా మ్యాచ్‌ల నుంచి రిషబ్ 90లలో అవుటైపోతున్నాడు. అయితే ఈ సారి మాత్రం సెంచరీ మార్క్ దాటాడు. దీంతో రిషబ్‌తో పాటు భారత క్రికెట్ అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు. అయితే పంత్ సెంచరీతో అభిమానులు ఎంతలా ఆనందపడ్డారో తెలియదు కానీ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఎగిరి గంతేశాడు. డ్రెస్సింగ్ రూంలో నుంచి బాల్కనీలోకి పరిగెత్తుకుంటూ వచ్చి చప్పట్లు కొడుతూ అభినందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



Updated Date - 2021-03-06T03:54:37+05:30 IST