వంతెనపై వెయిరింగ్ కోట్ కాంక్రీట్ పనుల ప్రారంభం
ABN , First Publish Date - 2022-09-25T03:03:39+05:30 IST
సంగం బ్యారేజీ వంతెనపై వెయిరింగ్ కోట్ కాంక్రీట్ పనులు శనివారం ప్రారంభించారు. 15 చదరపు సెంటీమీటర్ల చొప్పున ఇ
సంగం, సెప్టెంబరు 24: సంగం బ్యారేజీ వంతెనపై వెయిరింగ్ కోట్ కాంక్రీట్ పనులు శనివారం ప్రారంభించారు. 15 చదరపు సెంటీమీటర్ల చొప్పున ఇనుప కమ్ములు ఏర్పాటు చేసి 15 మీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల మందంతో సిమెంట్ కాంక్రీట్ వేస్తున్నారు. రోజుకు 50 మీటర్ల చొప్పున పనులు చేయనున్నట్లు పర్యవేక్షణ ఇంజనీరింగ్ అధికారి విజయరామిరెడ్డి తెలిపారు, మొత్తం 1195 మీటర్ల పొడవునా కాంక్రీట్ వేయాల్సి ఉందన్నారు. సజావుగా పనులు సాగితే సుమారు 25 రోజుల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు. కానీ వచ్చే సీజనంతా వర్షాకాలం కావడంతో పనులు పూర్తయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని అన్నారు. అయితే వేగంగా పనులు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
----------