కొళత్తూరులో రూ.1.86 కోట్లతో Football మైదానం
ABN , First Publish Date - 2022-05-27T13:34:56+05:30 IST
స్థానిక కొళత్తూరు నియోజకవర్గంలోని పల్లవన్ సాలై వద్దనున్న మైదానంలో ‘సింగార చెన్నై 2.0’ అమలులో భాగంగా రూ.1.86 కోట్లతో నిర్మించనున్న ఫుట్బాల్ క్రీడామైదానానికి గురువారం
- Cm Sralin శంకుస్థాపన
చెన్నై: స్థానిక కొళత్తూరు నియోజకవర్గంలోని పల్లవన్ సాలై వద్దనున్న మైదానంలో ‘సింగార చెన్నై 2.0’ అమలులో భాగంగా రూ.1.86 కోట్లతో నిర్మించనున్న ఫుట్బాల్ క్రీడామైదానానికి గురువారం ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. ఇదే విధంగా రూ. 30.42 లక్షలతో నిర్మించనున్న ప్రహరీ, రూ.7.56 లక్షలతో ఏర్పాటు చేయనున్న కాలినడక మార్గం, రూ.24.47లక్షలతో నిర్మించనున్న గ్యాలరీకి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ఫుట్బాల్ మైదానం నమూనా పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, పీకే శేఖర్బాబు, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియా, డిప్యూటీ మేయర్ మహే్షకుమార్, కమిషనర్ గగన్దీ్ప సింగ్ బేదీ, డిప్యూటీ కమిషనర్ స్నేహ, ఎంపీ కళానిధి వీరాసామి పాల్గొన్నారు.