ప్రజా స్పందనను ఓర్వలేకే.. కొల్లు రవీంద్ర
ABN , First Publish Date - 2022-06-19T14:59:36+05:30 IST
Krishna: చంద్రబాబు నిర్వహిస్తున్న మినీమహానాడు కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనను చూసి సీఎం జగన్ ఓర్వలేకపోతున్నాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
Krishna: చంద్రబాబు నిర్వహిస్తున్న మినీమహానాడు కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనను చూసి సీఎం జగన్ ఓర్వలేకపోతున్నాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, ఇల్లు కూల్చివేతలకు పాల్పడుతుందన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించినా ప్రజా పక్షాన తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అయ్యన్న పాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టి గోడ కూల్చారని తెలిపారు. అయ్యన్న పాత్రుడిపై ప్రభుత్వం పదే పదే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. పోలీసులు ప్రజా రక్షణ వదిలేసి వైసీపీ అనుకూల విధానాలకు వత్తాసు పలుకుతుండడం దారుణమన్నారు.