AP News: ఆ బారికేడ్లు తీస్తారా..? లేదా?.. కొల్లు రవీంద్ర ధర్నా

ABN , First Publish Date - 2022-07-25T20:34:32+05:30 IST

మచిలీపట్నం సెంటర్‌లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ కొల్లు రవీంద్ర ధర్నా..

AP News: ఆ బారికేడ్లు తీస్తారా..? లేదా?.. కొల్లు రవీంద్ర ధర్నా

కృష్ణా జిల్లా (Krishna dist.): మాజీ మంత్రి పేర్ని నాని (Perni nani) కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మచిలీపట్నం (Machilipatnam) రాజాగారి సెంటర్ కూడలిని మూసివేస్తూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బారికేట్లు తీస్తారా..? లేదా..? అంటూ అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. కొంత మంది వ్యాపారుల మీద ఉన్న వ్యక్తిగత కక్షతో నిత్యం రద్దీగా ఉండే రాజాగారి సెంటర్‌ను బారికేట్లతో మూసివేయడాన్ని కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. బారికేట్లు మూసివేయటం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ట్రాఫిక్ (Traffic) సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. దీనిపై జిల్లా ఎస్పీని అపాయింట్ మెంట్ కోరినా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బారికేట్లు తొలగించే వరకు ప్రజల పక్షాన టీడీపీ (TDP) పోరాడుతుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-25T20:34:32+05:30 IST