Kollu Ravindra: దమ్ముంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై సీఎం సమాధానం చెప్పాలి..

ABN , First Publish Date - 2022-09-05T18:28:14+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి దేశమంతా భారతీ రెడ్డి, విజయసాయిల పాత్రల గురించే మాట్లాడకుంటోందని..

Kollu Ravindra: దమ్ముంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై సీఎం సమాధానం చెప్పాలి..

అమరావతి (Amaravathi): ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) గురించి దేశమంతా భారతీ రెడ్డి (Bharti Reddy), విజయసాయి రెడ్డి (Vijayasai reddy)ల పాత్రల గురించే మాట్లాడకుంటోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ స్కాంపై సమాధానం చెప్పుకోలేని సీఎం జగన్ (CM Jagan), చంద్రబాబు (Chandrababu) కుటుంబ సభ్యులపై ఎదురుదాడి చేయించటం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ పదవుల కోసం దిగజారి ఆరోపణలు చేసే మహిళా నేతలు వారి గౌరవన్ని తగ్గించుకునేలా ప్రవర్తించటం నీచాతి నీచమన్నారు. చంద్రబాబు బిక్షతో రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పడు స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారటం సిగ్గుచేటన్నారు. తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) నుంచి రాసిచ్చే స్క్రిప్టు మాట్లాడకుంటే పదవులు పోతాయనే భయంతో ఎంతకైనా దిగజారి రాజకీయ విలువలకు పాతరేస్తున్నారని మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థను గౌరవంగా నడిపిస్తూ మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించి ఎందరికో నారా భువనేశ్వరి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తాతా, నాయనమ్మల పేరు మీద నడిచే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరికో ప్రాణభిక్ష పెట్టడంలో బ్రాహ్మణి కీలకంగా ఉన్నారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భువనేశ్వరి, బ్రాహ్మణిలపై మనసు చంపుకుని చేసే విమర్శల ద్వారా మరింత పతనమవుతున్నారని కొల్లు రవీంధ్ర అన్నారు.

Updated Date - 2022-09-05T18:28:14+05:30 IST