Mahanaduకు ప్రభుత్వం అడ్డంకులు పెట్టింది: Kollu Ravindra

ABN , First Publish Date - 2022-05-29T18:37:54+05:30 IST

మహానాడుకు వైసీపీ ప్రభుత్వం (ycp govt.) అడ్డంకులు పెట్టిందని కొల్లు రవీంద్ర అన్నారు.

Mahanaduకు ప్రభుత్వం అడ్డంకులు పెట్టింది: Kollu Ravindra

Vijayawada: మహానాడుకు వైసీపీ ప్రభుత్వం (ycp govt.) అడ్డంకులు పెట్టిందని టీడీపీ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చ జరిగిందన్నారు. గన్నవరంలో ఎన్టీఆర్ (NTR) విగ్రహం కనబడకుండా ఫ్లెక్సీ కట్టిన వంశీ చరిత్రహీనుడని దుయ్యబట్టారు. సామాజిక న్యాయానికి సమాధి కట్టి వైసీపీ నేతలు బస్సు యాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ఆంధ్రవాళ్లు దోచుకుంటున్నారని మాట్లాడిన తెలంగాణ వ్యక్తి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారని, ఇది సామాజిక న్యాయం అంటే తాము నమ్మాలా? అని కొల్లు రవీంద్ర నిలదీశారు.

Updated Date - 2022-05-29T18:37:54+05:30 IST