జీవో 217 తక్షణం రద్దు చేయాలి: కొల్లు రవీంద్ర
ABN , First Publish Date - 2021-10-12T02:32:26+05:30 IST
మత్య్సకారుల కడుపుకొట్టే విధంగా చేపల చెరువుల ఆన్లైన్ వేలం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 217ను తక్షణం రద్దు చేయాలని
విజయవాడ: మత్య్సకారుల కడుపుకొట్టే విధంగా చేపల చెరువుల ఆన్లైన్ వేలం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 217ను తక్షణం రద్దు చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో రద్దు చేసేంతవరకు రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. గతనెల 20న రాష్ట్రవ్యాప్తంగా కలక్టరేట్ల వద్ద నిరసన చేపట్టి ఆయా కలెక్టర్లకు మత్య్సకారుల సమస్యలను వివరించామన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోతో మత్య్సకారులు రోడ్డున పడే పరిస్థితి ఉందని ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ప్రభుత్వం దీనిపై పునరాలోచించలేదని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.