నలుగురు మత్స్యకారులు గల్లంతు... కొల్లు రవీంద్ర ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2022-07-05T22:37:34+05:30 IST

జిల్లాలని మచిలీపట్నం మండలం క్యాంబెల్‌పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

నలుగురు మత్స్యకారులు గల్లంతు... కొల్లు రవీంద్ర ఏమన్నారంటే..?

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నం మండలం క్యాంబెల్‌పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మత్స్యకారుల కుటుంబాలను టీడీపీ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.... మెరైన్ పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం ఉందన్నారు. మత్స్యకారుల ఆచూకీ కనుగొనేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మెరైన్ పోలీసు స్టేషన్ పెట్టి.. నాలుగు పడవులు నిరుపయోగంగా ఉంచారని మండిపడ్డారు. అవి పని చేయకపోవడం వల్లే.. వెంటనే వెళ్లలేకపోయారని పేర్కొన్నారు. మెరైన్ పోలీస్టేషన్‌లో పోలీసులు విధులకు విరుద్దంగా వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లంతు అయిన మత్స్యకారుల ఆచూకీ కనుగొనేలా చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం అవసరమైతే హెలికాప్టర్‌, యుద్ధ విమానాలు దింపాలన్నారు. 

Updated Date - 2022-07-05T22:37:34+05:30 IST