Munugde By-election: రాజగోపాల్‌రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-16T02:01:42+05:30 IST

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) మోసకారి మాటలను మరోసారి నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరని

Munugde By-election: రాజగోపాల్‌రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు: జగదీష్‌రెడ్డి

నల్లగొండ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) మోసకారి మాటలను మరోసారి నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) తెలిపారు. మునుగోడు (Munugode) సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ మునుగోడు ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ చైతన్యాన్ని చూపిస్తున్నారని చెప్పారు. కలిసికట్టుగా మునుగోడును అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్‌ (TRS)లో చేరుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) సభ అనగానే గ్రామాల్లో సంతోషం నెలకొందన్నారు. ఫ్లోరైడ్‌ను తరిమికొట్టి సురక్షిత నదీ జలాలను అందిస్తున్న తమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూడటానికి మునుగోడు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టులు, వ్యాపారాలే ముఖ్యమని, ప్రజలు కాదని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డికి ఇవే చివరి ఎన్నికలని ఎద్దేవా జగదీష్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-08-16T02:01:42+05:30 IST