అధికారం శాశ్వతం కాదు.. త్వరలో మేమేంటో చూపిస్తాం: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-07-28T17:23:42+05:30 IST

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అరెస్ట్‌ను ఖండిస్తున్నానని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

అధికారం శాశ్వతం కాదు.. త్వరలో మేమేంటో చూపిస్తాం: కోమటిరెడ్డి

నల్గొండ: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అరెస్ట్‌ను ఖండిస్తున్నానని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్భందాలు సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదని.. త్వరలో తామేంటో చూపిస్తామన్నారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోమటిరెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనియ్యబోమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఏకంగా కావాలన్నారు. మునుగోడుకు మంత్రి జగదీష్‌రెడ్డి నిధులు తీసుకురావడం లేదన్నారు. ఈటలను ఓడించేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. దళితులను మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-07-28T17:23:42+05:30 IST