జనం కాంగ్రెస్‌ వైపే ఉన్నారు: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2022-07-15T02:00:12+05:30 IST

జనం ఒక పార్టీ వైపే ఉన్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

జనం కాంగ్రెస్‌ వైపే ఉన్నారు: కోమటిరెడ్డి

మిర్యాలగూడ: జనం కాంగ్రెస్‌ వైపే ఉన్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో విసిగిపోయిన జనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. సొంత సర్వేలతో కాకి లెక్కలు వేస్తూ ప్రజల్ని గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పంజాబ్‌లో రైతులు మరణిస్తే రూ.30 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో రైతులు, ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2022-07-15T02:00:12+05:30 IST