హైకోర్టుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ

ABN , First Publish Date - 2021-03-25T23:29:34+05:30 IST

హైకోర్టుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. తుర్కయాంజల్‌లో తులిప్స్ గ్రాండ్ హోటల్‌పై ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ అనుమతి లేకుండా

హైకోర్టుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ

రంగారెడ్డి: హైకోర్టుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. తుర్కయాంజల్‌లో తులిప్స్ గ్రాండ్ హోటల్‌పై ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా నిర్మించిన హోటల్‌ను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారని లేఖలో కోమటిరెడ్డి ప్రస్తావించారు. హెచ్ఎండీఏ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కోమటిరెడ్డి లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. తులిప్స్ గ్రాండ్ హోటల్ యాజమాన్యాన్ని ప్రతివాదిగా కోర్టు చేర్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, తులిప్స్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది.

Updated Date - 2021-03-25T23:29:34+05:30 IST