చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు..: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2022-04-12T18:53:03+05:30 IST
వరి ధాన్యం కొనుగోలుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని.. కానీ సీఎం కేసీఆర్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని ఎంపీ , స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని.. కానీ సీఎం కేసీఆర్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని ఎంపీ , స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు.. చంద్రబాబు కు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది. మీరు నిరసనలు చేస్తే పోలీసులు పట్టించుకోరు...మేము నిరసనలు చేస్తే..అరెస్ట్లు చేయిస్తున్నారు. దేవుడు దయతో వర్షాలు బాగా పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్ వాటర్ పెరిగిందని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటుంన్నారు. ధాన్యం కొనుగోలు చేయమంటే రెండు అధికార పార్టీల్లోని నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుంన్నారు.. ఇద్దరి సంగతి ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.