గోవులను అడ్డుపెట్టుకొని రాజకీయం తగదు

ABN , First Publish Date - 2021-01-16T05:25:55+05:30 IST

గోవులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయటం జగన్‌మోహన్‌రెడ్డికి తగదని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు.

గోవులను అడ్డుపెట్టుకొని రాజకీయం తగదు

 మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి


పెదకూరపాడు, జనవరి 15 : గోవులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయటం జగన్‌మోహన్‌రెడ్డికి తగదని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ రథాలు తగులబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేయించి మరోవైపు పూజల్లో పాల్గొంటున్నారన్నారు. క్రిస్మస్‌,  రంజాన్‌,  సంక్రాంతి కానులకను దూరం చేశారని, ఆలయాలపై జరిగే దాడులకు రాజకీయ రంగు పులిమారే తప్ప ఆ దాడులను నివారించటంలో చిత్తశుద్ధి చూపారా? అని ప్రశ్నించారు.  

Updated Date - 2021-01-16T05:25:55+05:30 IST