ప్రజాస్వామ్యానికి పాతర : కొమ్మాలపాటి

ABN , First Publish Date - 2021-01-22T05:55:46+05:30 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వైసీపీ ప్రభుత్వం పాతర వేస్తుందని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ తెలిపారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కాలనే కుట్రపూరితంగా వెంకటరావును అరెస్టు చేశారన్నారు.

ప్రజాస్వామ్యానికి పాతర : కొమ్మాలపాటి

పెదకూరపాడు, జనవరి 21 : రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వైసీపీ ప్రభుత్వం పాతర వేస్తుందని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ తెలిపారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కాలనే కుట్రపూరితంగా వెంకటరావును అరెస్టు చేశారన్నారు. టీడీపీ చేపట్టిన ధర్మ పరిరక్షణా యాత్రను పక్కదారి పట్టించేందుకే వెంకటరావును అరెస్టు చేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అండతో దేవాలయాల పై కుట్ర పూరితంగా దాడులు చేస్తున్న వారిని వదిలేసి మాజీ మంత్రిని అరెస్టు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. జగన్‌ నియంత పాలన ఎంతో కాలం సాగదన్నారు.


Updated Date - 2021-01-22T05:55:46+05:30 IST