మాటల గారడీతో సీఎం మోసం

ABN , First Publish Date - 2022-05-26T06:29:19+05:30 IST

మాటల గారడీతో సీఎం మోసం

మాటల గారడీతో సీఎం మోసం
లింగంపల్లి గ్రామస్థులతో మాట్లాడుతున్న కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి

- తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ వైపు చూస్తున్న ప్రజలు

- రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ఖచ్చితంగా అమలు చేస్తుంది

- మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి

బచ్చన్నపేట, మే 25 : మాటల గారడీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసపుచ్చుతున్నారని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి ఆరోపించారు. బుధవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం, ఇటుకాపల్లి, రాంచంద్రాపూర్‌, కొన్నె, దబకుంటపల్లి, లింగంపల్లి, మన్‌షాన్‌పల్లి గ్రామాలలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలను కలుస్తూ వరంగల్‌ డిక్లరేషన్‌ కరపత్రాలను ఆయన అందించారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీతో సహా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే కల్వకుంట్ల కుటుంబం ప్రజల ఆశలను వమ్ముచేసే కోట్లకు పడగలెత్తిందన్నారు. రైతులకు, నిరుద్యోగులతో సహా ఎవ్వరికి ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌ ప్రభత్వం నిలబెట్టుకోలేదన్నారు. నియంత పాలన సాగిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీకి తెగబడ్డారన్నారు. వారికి గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు నల్లగోని బాలకిషన్‌ గౌడ్‌, జిల్లెల్ల సిద్దారెడ్డి, ఆరుగొండ పర్శరాములు, జంగిటి విద్యానాథ్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతికుమార్‌, జ్యోతి భాస్కర్‌, రాము, సురేందర్‌రెడ్డి, రొండ్ల శ్రీనివా్‌సరెడ్డి, శింగరయ్య, కవిత, దిడిగ రమేశ్‌, ఎల్లారెడ్డి, మల్లేశం మల్లారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T06:29:19+05:30 IST