మావోయిస్టు నేత భాస్కర్ లక్ష్యంగా కొనసాగుతున్న కూంబింగ్

ABN , First Publish Date - 2020-09-23T13:24:58+05:30 IST

మావోయిస్టు నేత భాస్కర్ లక్ష్యంగా జిల్లాలో కూంబింగ్ కొనసాగుతోంది.

మావోయిస్టు నేత భాస్కర్ లక్ష్యంగా కొనసాగుతున్న కూంబింగ్

కొమురంభీం: మావోయిస్టు నేత భాస్కర్ లక్ష్యంగా జిల్లాలో కూంబింగ్ కొనసాగుతోంది. కడంబ అటవీ ప్రాంతంతో పాటు ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. మహారాష్ట్ర వైపు వెళ్లే దారుల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన రెండో మావోయిస్టు చుక్కాలు మృతదేహాన్ని ఛత్తీస్‌గడ్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులకు గత రాత్రి పోలీసులు అప్పగించారు. రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళాడని.. ఇలా చనిపోతాడని అనుకోలేదని బాజీరావు తండ్రి జుడువా ఆవేదన వ్యక్తం చేశాడు. 

Updated Date - 2020-09-23T13:24:58+05:30 IST