పెంచలస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-10-03T05:09:42+05:30 IST

కోనలో పెంచలస్వామి, ఆదిలక్ష్మి, ఆంజనేయ స్వామి వార్లను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టీ.రాజశేఖరరావు ఆదివారం దర్శించుకుని పూజలు నిర్వహించారు.

పెంచలస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
కోనలో శ్రీవారి ఆలయంలోని ధ్వజస్థంభం వద్ద పూజలు చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి

రాపూరు, అక్టోబరు 2: కోనలో పెంచలస్వామి, ఆదిలక్ష్మి, ఆంజనేయ స్వామి వార్లను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టీ.రాజశేఖరరావు ఆదివారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కల్యా ణ మండపంలో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, శ్రీవారి శేషవస్త్రాలు అంద జేశారు.  ఆయన వెంట ఆలయ చైర్మన్‌ చెన్ను తిరుపాల్‌రెడ్డి, ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T05:09:42+05:30 IST