9 నుంచి కొండవీడు ఎక్స్ప్రెస్ రాకపోకలు
ABN , First Publish Date - 2020-12-03T05:50:56+05:30 IST
మచిలీపట్నం నుంచి నంద్యాల మీదుగా యశ్వంత్పూర్ వెళ్లే కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 9వ తేదీ నుంచి నడుస్తుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు
నంద్యాల (ఎడ్యుకేషన్), డిసెంబరు 2: మచిలీపట్నం నుంచి నంద్యాల మీదుగా యశ్వంత్పూర్ వెళ్లే కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 9వ తేదీ నుంచి నడుస్తుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్లోని రైల్ నిలయం జోనల్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు బుధవారం తెలిపారు. 0711 నెంబరు గల కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు బుధ, శని, సోమవారాలలో మచిలీపట్నం నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు బయలు దేరి విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, అనంతపురం మీదుగా మరుసటి రోజు ఉదయం యశ్వంత్పూర్ చేరుకుంటుందని వెల్లడించారు. నంద్యాలకు రాత్రి 11.15 గంటలకు చేరుకొని 11.20 గంటలకు బయలు దేరుతుందని అన్నారు. ఇదే రైలు యశ్వంత్పూర్ నుంచి గురు, శని, మంగళవారాల్లో బయలుదేరి నంద్యాలకు రాత్రి 10.40 గంటలకు చేరుకుంటుందని, ఇక్కడి నుంచి 10.45 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం మచిలీపట్నానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు రైలు ప్రయాణాన్ని వినియోగించుకోవాలని కోరారు.