TRS MLA challenge: చెరువుల కబ్జాపై బండి సంజయ్కు కూకట్పల్లి ఎమ్మెల్యే సవాల్
ABN , First Publish Date - 2022-09-15T17:06:54+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay)కు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavarm krishna rao) సవాల్ విసిరారు. నిన్న మూసపేటలో చెరువుల కబ్జా చేస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే (TRS MLA), నాయకులపై బండి సంజయ్ (Telangana BJP Chief) ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ (BJP Leader) ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే... చెరువుల కబ్జాపై బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA), మీడియాతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తే వారితో కలిసి కబ్జాలపై విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. తాను గానీ చెరువుల కబ్జాకు పాల్పడినట్లు నిరూపణ అయితే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కబ్జాలలో బీజేపీ నాయకుల హస్తం ఉంటే బండి సంజయ్ రాజీనామాకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ చేశారు.