రాష్ట్రంలో అరాచకపాలన: కూన రవికుమార్‌

ABN , First Publish Date - 2020-08-09T10:39:54+05:30 IST

రాష్ట్రంలో కరోనాతో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నా, ఇవేవీ పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ప్రభుత్వ మాజీ విప్‌, టీడీపీ నేత కూన రవికుమార్‌ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అరాచకపాలన: కూన రవికుమార్‌

పొందూరు:రాష్ట్రంలో కరోనాతో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నా, ఇవేవీ పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ప్రభుత్వ మాజీ విప్‌, టీడీపీ నేత కూన రవికుమార్‌ ధ్వజమెత్తారు. వీఆర్‌ గూడెంలో అనారోగ్యంతో మృతిచెందిన టీడీపీ నాయకుడు కంచరాన నాగేశ్వరరావు కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానులంటూ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, దళితులపై దాడులు, న్యాయవ్యవ స్థపై బురదచల్లడం, ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు. ఇలా ఫ్యాక్షన్‌ రాజకీయాలను ప్రొత్సహిస్తున్నట్లు కూన విమర్శించారు. టీడీపీ నాయకులు ఎస్‌. శ్రీనివాసరావు, గోవింద, పాపారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-09T10:39:54+05:30 IST