కొర్రమీను చేపల కూర

ABN , First Publish Date - 2020-06-06T18:17:23+05:30 IST

కొర్రమీను చేపలు - అరకేజీ, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత

కొర్రమీను చేపల కూర

కావలసినవి: కొర్రమీను చేపలు - అరకేజీ, ధనియాల పొడి -  రెండు టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీస్పూన్‌, కారం- రెండు టీస్పూన్లు, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, మెంతిపొడి - అర టీస్పూన్‌, చింతపండు - యాభై గ్రాములు, నూనె - సరిపడా, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ: ముందుగా చేపలను ఉప్పుతో బాగా శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక బౌల్‌లోకి చేప ముక్కలు తీసుకొని అందులో చింతపండు రసం, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి బాగా కలపాలి. కాసేపు వీటిని పక్కన పెడితే చేప ముక్కలకు మసాలా పట్టుకుంటుంది. 

ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక ధనియాల పొడి వేయాలి. వెంటనే చేప ముక్కలు వేసి కలపాలి. తరువాత కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కొర్రమీను ముక్కలు ఉడికిన తరువాత కొత్తిమీర వేసుకొని దించాలి. 

Updated Date - 2020-06-06T18:17:23+05:30 IST