ఎల్డీఎంగా కోటేశ్వరరావు
ABN , First Publish Date - 2022-08-09T06:57:06+05:30 IST
ఎల్డీఎంగా కోటేశ్వరరావు
విజయవాడ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం)గా ఎన్టీఆర్ జిల్లాకు పి.కోటేశ్వ రరావు నియమితులయ్యారు. ఆయన సోమవారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. జిల్లాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్గా వ్యవహరిస్తోంది. కోటేశ్వరరావు ఇంతకుముందు ఎస్ఎల్బీసీలో మూడేళ్లు సీనియర్ మేనేజర్గా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ దిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు.