రామాలయంలో కోటి దీపోత్సవం
ABN , First Publish Date - 2021-12-01T07:02:06+05:30 IST
లింగగిరి గ్రామంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో సోమవారం రాత్రి కోటి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
హుజూర్నగర్ , నవంబరు 30: లింగగిరి గ్రామంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో సోమవారం రాత్రి కోటి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. అనంతరం గోవింద భజనమండలి ఆధ్వర్యంలో భక్తి గీతాలు ఆలపించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది
అర్వపల్లి: అర్వపల్లి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రాంగణంలో మంగళవారం దీపాలు వెలిగించారు.