జమిలీ ఎన్నికలు తధ్యం.. టీడీపీ గెలుపు ఖాయం : కోట్ల

ABN , First Publish Date - 2021-02-28T20:18:43+05:30 IST

జమిలీ ఎన్నికలు రావడం తధ్యమని.. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని

జమిలీ ఎన్నికలు తధ్యం.. టీడీపీ గెలుపు ఖాయం : కోట్ల

కర్నూలు : జమిలీ ఎన్నికలు రావడం తధ్యమని.. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం నాడు డోన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎక్కడా ప్రశాంతంగా జరగలేదన్నారు. వైసీపీ నాయకులకు చేతగాక పోలీసులను అడ్డంపెట్టుకొని పంచాయతీ ఎన్నికల్లో గెలిచారు. మున్సిపల్ ఎన్నికలు పోలీసులు- టీడీపీ మధ్య జరుగుతున్నాయి. వెంకటనాయుని పల్లెలో రాతి స్తంభాలను పగులగొట్టిన వారిపై చర్యలు తీసుకోండి. వైసీపీకి దమ్ము, ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా మున్సిపల్ ఎన్నికలకు రావాలి. పోలీసులు.. వైసీపీ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేస్తున్నట్లుగా ఉందిఅని కోట్ల వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పొలిటికల్ పార్టీల మధ్య పోలీసులు జోక్యం చేసుకోవడం మంచిది కాదని ఈ సందర్భంగా సూర్యప్రకాష్ హెచ్చరించారు.

Updated Date - 2021-02-28T20:18:43+05:30 IST