పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-03-04T06:31:46+05:30 IST

జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను బుధవారం అర్హులకు చిలుకూరు పీహెచ్‌సీలో వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ ప్రారంభించారు.

పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌
టీకా వేస్తున్న వైద్యులు

 చిలుకూరు/అనంతగిరి/మునగాల మార్చి  3: జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను బుధవారం అర్హులకు చిలుకూరు పీహెచ్‌సీలో వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతగిరి మండలం త్రిపురవరం పీహెచ్‌సీలో  గ్రామానికి చెందిన అశోక్‌రెడ్డికి మొదటి టీకాను వైద్యాధికారి లక్ష్మీప్రసన్న వేశారు.  మునగాల పీహెచ్‌సీలో  మండల పరిధిలోని రేపాల పీహెచ్‌సీ కరోనా వ్యాక్సినేషన్‌ను  వైద్యాధికారి యాదా రమేష్‌ ప్రారంభించారు. 85 ఏళ్ల వయసు ఉన్న  కొణిజేటి సత్యవతమ్మకు మొదటి టీకా వేశారు. చిలుకూరులో  సీహెచ్‌ఓ వినోద్‌కుమార్‌, శ్రీనివాస్‌, ఏఎన్‌ఎంలు ఇందిర, భూలక్ష్మి, త్రిపవంరలో  వెంకమ్మ, కళావతి, జ్యోతి, శైలజ, మహేష్‌, మునగాల మండల  కేంద్రంలో దిలీ్‌పకుమార్‌, షాబుద్దీన్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-03-04T06:31:46+05:30 IST