కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు: తమిళసై

ABN , First Publish Date - 2021-01-24T23:49:52+05:30 IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీకాళహస్తిశ్వరుడిని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ దర్శించుకున్నారు.

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు: తమిళసై

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీకాళహస్తిశ్వరుడిని తెలంగాణ గవర్నర్  తమిళసై దర్శించుకున్నారు. అనంతరం ఆమె తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళసై మాట్లాడుతూ  కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మన దేశ శాస్త్రవేత్తలు  అందుబాటులోకి తేవటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అపోహలు విడనాడి... ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకొని కోవిడ్ నుండి రక్షణ పొంది ఆరోగ్యంగా ఉండాలని తమిళసై ఆకాంక్షించారు.

Updated Date - 2021-01-24T23:49:52+05:30 IST