సీపీఎం ఆధ్వర్యంలో కొవిడ్‌-హెల్ప్‌లైన్‌ కేంద్రం

ABN , First Publish Date - 2021-05-10T05:00:27+05:30 IST

సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌-హెల్ఫ్‌లైన్‌ కేంద్రాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాంమోహన్‌, డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డిలు ప్రారంభించారు.

సీపీఎం ఆధ్వర్యంలో కొవిడ్‌-హెల్ప్‌లైన్‌ కేంద్రం
కార్యక్రమంలో మాట్లాడుతున్న వైద్యులు డాక్టర్‌ రామ్మోహన్‌

పాలమూరు, మే 9 : సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌-హెల్ఫ్‌లైన్‌ కేంద్రాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాంమోహన్‌, డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశంలో బడుగుజీవుల పక్షాన నిలబడి పనిచేసేవి వామపక్షపార్టీలు అని అన్నారు. మహబూబ్‌నగర్‌లో గతంలో అనేక మార్లు పేదలను ఆదుకునేందుకు సీపీఎం ముందుకు వచ్చిన సందర్భాలు అనేకమున్నాయని అన్నారు. ఈ విపత్కాలంలో అమరజీవి ఎ.అరుణ సామాజిక సేవా కేంద్రం పేరిట హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సీపీఎం నాయకులను రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు కిల్లెగోపాల్‌, జిల్లా కార్యదర్శి ఎ.రాములు, ఎన్‌.కురుమూర్తి, చంద్రకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T05:00:27+05:30 IST