AP News: అమరావతి రైతుల పాదయాత్రలో భారీగా పాల్గొన్న కొవ్వలి మహిళలు

ABN , First Publish Date - 2022-09-29T15:57:05+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్రకు జననీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొంటూ తమ మద్దతు తెలుపుతున్నారు.

AP News: అమరావతి రైతుల పాదయాత్రలో భారీగా పాల్గొన్న కొవ్వలి మహిళలు

ఏలూరు: అమరావతి రైతుల పాదయాత్రకు జననీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొంటూ తమ మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు దెందులూరు మండలం కొవ్వలి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలో పాదయాత్రలో  కొవ్వలి మహిళలు భారీగా పాల్గొన్నారు. వైసీపీ మంత్రులపై వ్యాఖ్యలపై  మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదన్నారు. పాదయాత్ర చేస్తున్న మహిళలంటే అంత చులకనా అంటూ మండిపడ్డారు. వారు భూములు త్యాగం చేసి, పాదయాత్ర చేస్తున్నది వారి కోసం కాదన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలనే లక్ష్యంతోనూ... భావితరాల కోసం చేస్తున్నారని మహిళలు పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-29T15:57:05+05:30 IST