నైపుణ్యాల వెలికితీతకు క్రీడలు దోహదం
ABN , First Publish Date - 2021-12-08T04:55:29+05:30 IST
యువతలో ఉన్న అంతర్గత సామర్థ్యాలు, నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడా పోటీలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కుం దురు నాగార్జునరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కుందురు
మార్కాపురం(వన్టౌన్), డిసెంబరు 7: యువతలో ఉన్న అంతర్గత సామర్థ్యాలు, నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడా పోటీలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కుం దురు నాగార్జునరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ నియోజకవర్గ స్థాయి పోటీలు మంగళవారం నిర్వహించారు. పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతు ఆటలతో ఆరోగ్యం చేకూరుతుందని ప్రతి ఒక్కరూ పోటీలను వినియోగించుకొని జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. విద్యార్థులతో కలిసి ఎమ్మె ల్యే వివిధ ఆటలు ఆడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాల ముర ళీకృష్ణ, మార్కాపురం, తర్లుపాడు ఎంపీపీలు పి.అరుణ, ఎస్.భూలక్ష్మి, జడ్పీటీసీ స భ్యుడు ఎన్.బాపన్రెడ్డి, ఎంఈవో, స్పోర్ట్స్ కన్వీనర్ రాందాస్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి.