కృష్ణా: ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్తున్న నర్సింగ్ స్టాఫ్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-03-01T18:26:05+05:30 IST
జిల్లాలోని ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్తున్న 35 మంది పశ్చిమగోదావరి జిల్లా నర్సింగ్ స్టాఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్తున్న 35 మంది పశ్చిమగోదావరి జిల్లా నర్సింగ్ స్టాఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్19 సమయంలో నర్సింగ్, టెక్నికల్ స్టాఫ్ను కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం... గత కొంతకాలంగా వారి జీతాలను పెండింగ్లో పెట్టింది. అయితే కోవిడ్19 సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యోగం చేసిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉద్యమానికి కాంట్రాక్టు ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 35 మంది పశ్చిమగోదావరి జిల్లా నర్సింగ్ స్టాఫ్ను ఆత్కూరు పోలీసులు అడ్డుకున్నారు.