కృష్ణా: ఏ కొండూరు ఎస్సైపై వేటు

ABN , First Publish Date - 2022-03-16T22:42:16+05:30 IST

జిల్లాలోని ఏ కొండూరు ఎస్సై శ్రీనివాస్‌పై వేటు పడింది. రేపూడి

కృష్ణా: ఏ కొండూరు ఎస్సైపై వేటు

కృష్ణా: జిల్లాలోని ఏ కొండూరు ఎస్సై శ్రీనివాస్‌పై వేటు పడింది. రేపూడి తండా వాసి లాకావత్‌ బాలాజీ ఆత్మహత్య కేసులో ఎస్సై సస్పెండ్‌  అయ్యాడు. నాటుసారా కేసులో విచారణ పేరుతో బాలాజీ అనే వ్యక్తిని పీఎస్‌కు తీసుకువచ్చారని మృతుడి బంధువులు ఆరోపించారు. దీంతో విచారణ జరిపిన అధికారులు నివేదిక ఆధారంగా ఎస్సైపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నాటుసారా కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైలవరం ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2022-03-16T22:42:16+05:30 IST