AP: గడప గడపకు కార్యక్రమంలో ప్రభుత్వ తీరును ఎండగట్టిన ఉపాధ్యాయుడు

ABN , First Publish Date - 2022-05-21T18:34:08+05:30 IST

గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా చేదు అనుభవాలు, నిరసనలు ఎదురవుతున్నాయి.

AP: గడప గడపకు కార్యక్రమంలో ప్రభుత్వ తీరును ఎండగట్టిన ఉపాధ్యాయుడు

కృష్ణా: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా చేదు అనుభవాలు, నిరసనలు ఎదురవుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలో గడపగడపకు కార్యక్రమంలో ప్రభుత్వ తీరును ప్రైవేటు స్కూల్ నిర్వాహకుడు ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తనయుడు వికాస్‌ను రేషన్, ధాన్యం డబ్బు, మంచినీటి సమస్యలపై గ్రామస్తులు నిలదీశారు.  పార్టీ చూడం, కులం చూడమని చెప్పిన జగన్ ప్రభుత్వంలో మొత్తం వివక్షే కొనసాగుతోందంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఉపాధ్యాయుడు బయటపెట్టారు. వ్యవసాయ ఇన్సూర్యన్స్ లేకపోవటంతో 4 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని సాక్ష్యాలతో సహా నిలదీశారు. ప్రభుత్వ నిర్వాకంతో బస్తా ధాన్యాన్ని 690 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్పించి ఏమీ ఇవ్వటం లేదని మహిళలు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2022-05-21T18:34:08+05:30 IST