Krishna District: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. అనంతరం..!

ABN , First Publish Date - 2022-07-20T04:03:47+05:30 IST

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. అనంతరం వంతెన రె...

Krishna District: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. అనంతరం..!

కృష్ణాః బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. అనంతరం వంతెన రెయిలింగ్ మీదకు దూసుకువెళ్లింది. దీంతో రెయిలింగ్‌పై లారీ ప్రమాదకరంగా వేలాడింది. ఆ తర్వాత వంతెన కింద పానీ పూరీ బండిపై రెయిలింగ్ విరిగి పడింది. ఈ ఘటనతో హనుమాన్ జంక్షన్ -నూజివీడు ప్రధాన రహదారి‌పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. నూజివీడు వెళుతున్న లారీ.. ఏలూరు వెళుతున్న కారును ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-20T04:03:47+05:30 IST