PM Modi హెలికాప్టర్కు Black balloons ఎగరవేసిన ప్రధాన వ్యక్తి ఎవరంటే...
ABN , First Publish Date - 2022-07-07T18:43:41+05:30 IST
నరేంద్రమోదీ హెలికాప్టర్కు నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపిన ప్రధాన వ్యక్తి పాలకీర్తి రవిగా గుర్తించారు.
కృష్ణా (Krishna) జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendramodi) హెలికాప్టర్కు నల్ల బెలూన్లు (Black balloons) ఎగరవేసి నిరసన తెలిపిన ప్రధాన వ్యక్తి పాలకీర్తి రవి (Palakirti Ravi). ఈ మేరకు ఆయన పోలీసులకు లొంగిపోయాడు. అయితే ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ (Rajeev Ratan) ఆదేశాలతోనే తాను బెలూన్లు ఎగరవేశానని పోలీసులకు తెలిపాడు. ప్రధాని మోదీ వచ్చే ముందు రోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద సర్వే చేశామని చెప్పాడు. దీంతో పాలకీర్తి రవి, రాజీవ్ రతన్లను పోలీసులు విచారిస్తున్నారు. అనంతరం ఇద్దరికీ వైద్య పరీక్షలు చేయించనున్నారు. తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు.
ఈ నెల 4న ప్రధాని మోదీ భీమవరం (Bhimavaram) వెళుతున్న సమయంలో హెలికాఫ్టర్ ముందు నల్ల బెలూన్లు ఎగరవేయడాన్ని పోలీసులు (Police) అత్యంత సీరియస్గా తీసుకున్నారు. బెలూన్లు ఎగరవేయడాన్ని ప్రధాని భద్రతా పరంగా ఎస్పీజీ అధికారులు సీరియస్గా పరిగణించారు. ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారుల నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు. భవనంపైకి ఏ విధంగా వెళ్లారన్నదానిపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.