AP News: వివాహేతర సంబంధం... వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-07-26T14:51:33+05:30 IST

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం బద్రిరాజుపాలెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

AP News: వివాహేతర సంబంధం... వ్యక్తి దారుణ హత్య

విజయవాడ: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం బద్రిరాజుపాలెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి బద్రిరాజుపాలెం  గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కూడా మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సోమవారం రాత్రి ఒకే సమయంలో ఇరువురూ మహిళ ఇంటికి రావడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో శ్రీనివాసరెడ్డి హత్యకు గురయ్యాడు. దీంతో మహిళ అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందిన వెంటనే  గుడివాడ డీఎస్పీ సత్యానందం అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. 

Updated Date - 2022-07-26T14:51:33+05:30 IST