విజయవాడ కోర్టుకు కృష్ణా జిల్లా TDP నేతలు
ABN , First Publish Date - 2022-07-06T20:22:28+05:30 IST
ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు.
అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు(TDP leaders) బుధవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఉంచాలని కోరుతూ గత సంవత్సరం తెలుగదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు (devineni umamaheshwar rao) , టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్(YVB rajendraprasad), మాజీ జడ్ పి చైర్ పర్సన్ గద్దె అనురాధ (Gadde anuradha), బచ్చుల అర్జునుడు (Bachuala arjunudu), మాజీ శాసన సభ్యులు బోడే ప్రసాద్ (Bode prasad), మాజీ మేయర్ పంచుమర్తి అనురాధా (Panchumarhi anuradha) కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది.