కృష్ణా: పెద్ద కాలువలో నలుగురు యువకులు గల్లంతు
ABN , First Publish Date - 2022-03-20T02:42:44+05:30 IST
జిల్లాలోని గుడివాడ పట్టణంలో విషాదం నెలకొంది. మద్యం
కృష్ణా: జిల్లాలోని గుడివాడ పట్టణంలో విషాదం నెలకొంది. మద్యం తాగి పెద్ద కాలువలో ఈత కొట్టడానికి నలుగురు యవకులు దిగారు. అయితే మద్యం మత్తులో ఉండడంతో నీటిలో ఆ నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులను స్థానికులు ఒడ్డుకు చేర్చారు. వీసం పెద్దిరాజులు అనే యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న పెద్ది రాజులను హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెద్దిరాజులు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గుడివాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.