అసిస్టెంట్ లేబర్ కమిషనర్గా కృష్ణారెడ్డి
ABN , First Publish Date - 2022-07-02T07:37:12+05:30 IST
తిరుపతి జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్గా బీవీఎస్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు.
తిరుపతి(పద్మావతీనగర్), జూలై 1: తిరుపతి జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్గా బీవీఎస్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఐదు నెలల క్రితం కృష్ణారెడ్డి తిరుపతి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా నియమితులయ్యారు. అప్పటినుంచి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా తిరుపతిలో పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన అసిస్టెంట్ లేబర్ కమిషనర్గా పదోన్నతి పొందారు. తిరుపతి జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషన్ స్థానం ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం ఆయన్ను నియమించింది. ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.