కృష్ణానదిలో ముగ్గురు గల్లంతు
ABN , First Publish Date - 2022-08-20T02:20:09+05:30 IST
కృష్ణానది (Krishna River)లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు.
ఇబ్రహీంపట్నం: కృష్ణానది (Krishna River)లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లోని పవిత్ర సంగమంలో సరదాగా స్నానం చేసేందుకు ఆరుగురు ఎనిమిదో తరగతి విద్యార్థులు వెళ్లారు. వారు స్నానం చేస్తుండగా, వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో నలుగురు సురక్షితంగా బయటపడగా, ఒక విద్యార్థిని వాకింగ్కు వచ్చిన యువకుడు కాపాడాడు. మరో విద్యార్థి ఉప్పలపాటి లోకేశ్ (13) మాత్రం నదిలో కొట్టుకుపోయాడు. లోకేశ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF), పోలీస్, గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు. అలాగే, మోపిదేవి మండలంలోని కోసూరువారిపాలెంలో ఎడ్లబండిని శుభ్రం చేసేందుకు నలుగురు యువకులు కృష్ణానదిలోకి వెళ్లగా, వరద ఒక్కసారిగా పెరిగింది. నలుగురిలో ఇద్దరికి ఈత రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా కాగితాల హసంత్ (22), మేకా వెంకటేశ్ (20) ఆచూకీ తెలియలేదు.