ఆటో-రెండు బైక్లు ఢీ..11 మందికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2021-11-08T17:16:02+05:30 IST
ముదినేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి
కృష్ణా: ముదినేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమించింది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.