కృష్ణా జిల్లాలో టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2020-09-23T18:00:34+05:30 IST
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు నందిగామలో ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు.
కృష్ణా: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు నందిగామలో ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. నందిగామ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయలు కొట్టి దేవాలయం ముందు తమ నిరసనను తెలియజేశారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.