ఆప్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్గా కృష్ణయాదవ్ నియామకం
ABN , First Publish Date - 2022-05-16T05:39:40+05:30 IST
ఆప్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్గా కృష్ణయాదవ్ నియామకం
షాబాద్, మే 15: ఆమ్ ఆద్మీ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్గా బర్క కృష్ణయాదవ్ నియమితు లయ్యారు. ఆయన నియామకాన్నిపార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి సోమనాథ భారతి, సెర్చ్ కమిటీ కన్వీనర్ ఇందిరా శోభన్లు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరం దోమలగూడలోని పార్టీ కార్యాలయంలో బర్క కృష్ణయాదవ్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్ చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు కావాలంటే స్థానిక ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్తామన్నారు. తనకు పదవి కల్పించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్, ఎన్నికల ఇన్చార్జి సోమనాథ భారతి, సెర్చ్ కమిటీ కన్వీనర్ ఇందిరా శోభన్లకు కృష్ణయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.