శ్రీశైలం డ్యాంను సందర్శించిన కేఆర్ఎంబీ
ABN , First Publish Date - 2021-10-27T05:28:19+05:30 IST
శ్రీశైలం జలాశయాన్ని కేఆర్ఎంబీ సబ్ కమిటీ మంగళవారం పరిశీలించింది. జలాశయంలో నీటి వివరాలు, నీటి వినియోగం, సిబ్బంది వివరాలను బృందం సభ్యులు తెలుసుకున్నారు.
శ్రీశైలం, అక్టోబరు 26: శ్రీశైలం జలాశయాన్ని కేఆర్ఎంబీ సబ్ కమిటీ మంగళవారం పరిశీలించింది. జలాశయంలో నీటి వివరాలు, నీటి వినియోగం, సిబ్బంది వివరాలను బృందం సభ్యులు తెలుసుకున్నారు. వార్షిక బడ్జెట్, డ్యామ్లో చేయవలసిన మరమ్మతుల గురించి వివరాలను సేకరించారు. డ్యామ్ క్రస్టుగేట్లు, స్పిల్ వే, వాటి ఆపరేటంగ్ సిస్టమ్, పనితీరును తెలుసుకున్నారు. డ్యామ్ గ్యాలరీలోని మోటార్లను, వాటర్ పంపింగ్ విధానం, వాటి సమస్యలను అడిగారు. డ్యామ్ వ్యూపాయింట్ నుంచి జలాశయాన్ని పరిశీలించారు. అనంతరం కుడిగట్టు విద్యుత కేంద్రాన్ని సందర్శించారు. ఏపీ జెనకో చీఫ్ ఇంజనీర్, అధికారులతో చర్చించారు. అనంతరం ఏపీ జెన కో గేస్ట్హౌస్లో జలాశయం అధికారులతో సమావేశం నిర్వహించారు.