సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , First Publish Date - 2022-10-02T04:05:30+05:30 IST
గిరిజనులకు, ఆదివాసులకు దసరా కానుకగా పదిశాతం రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి క్షీరాభిషేకం చేశారు. గిరిజనుల చిరకాల కోరిక తీర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆసిఫాబాద్రూరల్, అక్టోబరు 1: గిరిజనులకు, ఆదివాసులకు దసరా కానుకగా పదిశాతం రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి క్షీరాభిషేకం చేశారు. గిరిజనుల చిరకాల కోరిక తీర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
జైనూరు: మండలంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనకయాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటా నికి క్షీరాభిషేకం నిర్వహించారు. వైస్ఎంపీపీ లక్ష్మణ్, అంబాజీ, ఆనంద్రావు, దేవు, రాంజీ, సర్పంచ్లు పాల్గొన్నారు.