మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు

ABN , First Publish Date - 2021-07-24T22:56:27+05:30 IST

ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఎన్నారై టీఆర్ఎస్ పక్షాన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యు

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు

హైదరాబాద్: ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఎన్నారై టీఆర్ఎస్ పక్షాన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో కలిసి దూలపల్లిలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఎన్నారై తెరాస లండన్ కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సంబరాలకు దూరంగా ఉంటూ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలువురికి ఆర్థిక సహాయాన్ని అందించినట్టు తెలిపారు. కేటీఆర్‌కు పుట్టినరోజు కానుకగా లండన్లో ఉన్న కార్యవర్గ సభ్యులు మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. అలాగే కేటీఆర్ చేస్తున్న సేవాకార్యక్రమాలు, అభివృద్ధి పనులను గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ నాయకుడిగా కేటీఆర్ ఎదిగినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై  తెరాస నాయకులు సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, శుభాష్ మరియు స్థానిక సికింద్రాబాద్ నాయకుడు నరేష్ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T22:56:27+05:30 IST