లోకల్ నాయకులే దాన్ని చూసుకుంటారు: మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2021-09-07T20:37:45+05:30 IST

కొందరు టీఆర్ఎస్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

లోకల్ నాయకులే దాన్ని చూసుకుంటారు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: కొందరు టీఆర్ఎస్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం గ్రేటర్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీబీజేపీ, టీకాంగ్రెస్‌లో కొందరికి పదవులు కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు. పేరుకు మాత్రమే ఢిల్లీ పార్టీలని.. అవి చేసేవి చిల్లర పనులని దుయ్యబట్టారు. 70 ఏళ్లలో చేయలేని పనులను ఏడేళ్లలో టీఆర్ఎస్ చేసిందని చెప్పారు. హుజురాబాద్ ఉపఎన్నిక చిన్నదని.. అది పార్టీకి పెద్ద లెక్కకాదన్నారు. దాన్ని స్థానిక నాయకులే చూసుకుంటారన్నారు. ప్రతిపక్షాల చిల్లర మాటలను గట్టిగా తిప్పికొట్టాలని మంత్రి కార్యకర్తలకు సూచించారు. గ్రేటర్‌లోని 6,300 కాలనీలు, బస్తీలకు కమిటీలు ఈనెల 20లోపు పూర్తిచేయాలని, త్వరలో 400 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-07T20:37:45+05:30 IST