మార్కెట్‌లో రూ.50 లక్షల విలువ చేసే ఇళ్లను ఫ్రీగా ఇస్తున్నాం: కేటీఆర్

ABN , First Publish Date - 2022-02-03T16:02:13+05:30 IST

ఖైరతాబాద్‌లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

మార్కెట్‌లో రూ.50 లక్షల విలువ చేసే ఇళ్లను ఫ్రీగా ఇస్తున్నాం: కేటీఆర్

హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మెయిన్ సెంటర్ పాయింట్‌లో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తున్నామన్నారు. మార్కెట్‌లో 50 లక్షల రూపాయల విలువ చేసే ఇళ్లు ఫ్రీగా ఇస్తున్నామన్నారు. 9714 కోట్ల రూపాయలతో హైద్రాబాద్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడుతున్నామన్నారు. వారం రోజుల్లో కొల్లూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. ఒకే చోట 15640 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించామన్నారు. 18 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నామన్నారు.


Updated Date - 2022-02-03T16:02:13+05:30 IST